వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై పర్యావరణ శాఖకు సమాధానమిస్తాం: సిఎం రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: పోలవరంపై పర్యావరణ శాఖకు తగు రీతిలో సమాధానం ఇస్తామని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఏఐసిసి సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన ఆయన సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుండి నోటీసులు రాలేదని, లేఖ మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. ఆ లేఖలో ఏముందో తనకు తెలియదని వెళ్లిన తర్వాత తెలుస్తుందన్నారు. అయితే కొన్ని వివరాలు అడిగినట్టుగా తెలుస్తుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కేంద్రమంత్రి జైరాం రమేశ్ తో సమావేశమయి ప్రభుత్వ వాదనను పోలవరానికి అనుకూలంగా వినిపిస్తారని చెప్పారు.

భారత్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర చాలా గొప్పదని రోశయ్య అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఔన్నత్యాన్ని అందరూ గౌరవించాల్సి ఉందన్నారు. ఆమె మళ్లీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం సంతోషకరమన్నారు. ఏఐసిసి సమావేశంలో కొన్ని నిర్ణాయాలు తీసుకుందని ఆ నిర్ణయాలు సైతం హర్షణీయమన్నారు.

వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. ముంపు ప్రాంతాలకు త్వరలో కేంద్రస్థాయి అధికారులు వచ్చి పర్యవేక్షిస్తారని చెప్పారు. వచ్చిన వారికి వరద ముంపుపై పూర్తి సమాచారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X