వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ముఖ్యమంత్రి పదవి కోసం నలుగురు మంత్రుల పోటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం నలుగురు మంత్రులు పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ఒకటి వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. మంత్రులు జె. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్ ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో చురుగ్గా పని చేసే మంత్రిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చడం ఇష్టం లేని అధిష్టానం ఉప ముఖ్యమంత్రి ద్వారా పాలనా యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జె. గీతారెడ్డి ఇప్పటికే శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. పైగా దళిత వర్గానికి చెందిన మహిళా నాయకురాలు కావడం ఆమెకు కలిసి వచ్చే విషయమని అంటున్నారు. ముఖ్యమంత్రి కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడు కావడంతో తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు. పిసిసి అధ్యక్షుడు తెలంగాణకు చెందిన నాయకుడు కావడంతో ఉప ముఖ్యమంత్రి పదవి తమ ప్రాంతానికి దక్కే అవకాశం ఉందని భావించి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా వ్యవహారాలను చక్కబెట్టడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పొన్నాల లక్ష్మయ్య చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి వివాదంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ అధిష్టానం మనసును ఆకట్టుకునే ప్రయత్నం సాగిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన బిసి నాయకుడు కావడం వల్ల తనకు అవకాశం ఉందని మంత్రి దానం నాగేందర్ అనుకుంటున్నారు. తాను నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని, ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదని ఆయన బహిరంగంగానే అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X