రహేజా ఐటి పార్కు కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంటు సోదాలు
రహేజాకు మాదాపూర్ లో ఎపిఐఐసి 50 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 60 కోట్ల రూపాయలకు 110 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ 600 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 15 ఐటి సంస్థలున్నాయి. ఈ స్థలాలను ఐటి సంస్థలకు మాత్రమే రహేజా కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా రహేజా స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి.
Comments
Story first published: Tuesday, November 2, 2010, 14:53 [IST]