హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ రావుపై కేసు పెట్టిస్తా: మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mallu Bhatti vikramarka
హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) సమావేశంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సరియైన ప్రాధాన్యం లభించిందని ప్రభుత్వ చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొందరు ఉద్దేశ్య పూర్వకంగానే వైఎస్ కు సరియైన ప్రాధాన్యం లభించలేదంటున్నారని, అయితే అందులో నిజం లేదని అన్నారు.

తెరాస నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి ఇంటిపై ఆమె లేని సమయంలో దాడి చేయటం హేయమని అన్నారు. దాడి కేసులో సైతం ఆయన తప్పించుకొని అమాయకులను అందులో ఇరికిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం జైలుకైనా వెళతామన్న హరీష్ రావు ఆ జైలు నుండి తప్పించుకోవడానికి సాటి తెలంగాణ వారిని జైలుకు పంపిస్తున్నాడని విమర్శించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. హరీష్ రావుపై కేసు పెట్టిస్తానని, ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X