విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూజివీడు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైల్లో వెంకటస్వామి అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓ హత్య కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా వెంటస్వామి ఉంటున్నాడు. అతను ఎలా మరణించాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనారోగ్యం కారణంగా అతను మరణించాడని, మూడు రోజుల పాటు చికిత్స కూడా ఇప్పించామని జైలు అధికారులు అంటున్నారు.

నూజివీడు సబ్ జైలు విషయంలో చాలా కాలంగా వివాదాలున్నాయి. ఈ జైలులో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. కరుడు గట్టిన నేరస్థుడు రామారావు కూడా ఈ జైలు నుంచే తప్పించుకున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాలనా వ్యవహారాలు కూడా సరిగా లేవని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X