వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో సతీ సమేతంగా కాలు మోపిన బరాక్ ఒబామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Barrack Obama
ముంబై: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్లీతో పాటు శనివారం మధ్యాహ్నం ముంబైలో కాలు పెట్టారు. మూడు రోజుల భారత పర్యటనకు ఆయన వచ్చారు. ఆయనకు భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విమానాశ్రయంలో ఘన స్వాతం చెప్పారు. వెంటనే ఆయన హెలికాప్టర్ లో ఐఎన్ఎస్ శిఖర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట 3 వేల మది ప్రతినిధులు వచ్చారు. ఆ తర్వాత ఆయన తాజ్ హోటల్ కు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన కాన్వాయ్ లో 40 కార్లున్నాయి. ఒబామా పర్యటన సందర్భంగా పారా మిలటరీ బలగాలు, ఎన్ఎస్ జి కమెండోలు, ఒబామా రక్షణకు చెందిన అమెరికా సీక్రెట్ సర్వీస్ ముంబైని తమ అదుపులోకి తీసుకున్నాయి.

ఓబామా మధ్యాహ్నం 3 గంటలు 20 నిమిషాలకు మణిభవన్ వెళ్తారు. ఆ తర్వాత నాలుగున్నర గంటలకు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఐదున్నర గంటలకు బిజినెస్ కౌన్సిల్ మీట్ లో పాల్గొంటారు. ఒబామా రాక సందర్భంగా ముంబైలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు జెట్ విమానాలు పహారా కాస్తుంటాయి. ముంబై తీరం వెంబడి 34 యుద్ధ నౌకలను మోహరించారు. ముంబై పర్యటన తర్వాత ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్తారు. ఈ నెల 8వ తేదీన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X