హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ తర్వాత సీమాంధ్ర ఛానళ్లు మరింత కుట్ర చేస్తాయి: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar rao
హైదరాబాద్: తెలంగాణకు ప్రధాన అడ్డంకి తెలుగుదేశం పార్టీయేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఖాళీ అవుతుందని ఆయన అన్నారు. త్వరలో దాని అడ్రస్ గల్లంతేనన్నారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ళ ధోరణితో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణలో తెలుగు దేశం నాయకులను ప్రజలు తిరగనివ్వడం లేదన్నారు. కెసిఆర్ ఆదివారం టిఆర్ఎస్ భవన్లో తెలంగాణ గ్రాడ్యుయేషన్ పోస్టర్ ను కెసిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఎస్సైలకు ప్రభుత్వం ప్రమోన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్లజ్జగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు, కష్టాలు తీరాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. అందుకోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం వివిధ పార్టీలనుండి ప్రజలు తెరాసలోకి భారీగా చేరుతున్నారని ఆయన అన్నారు.

కొన్ని ఛానళ్లు పని గట్టుకొని తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దిక్కుమాలిన కథనాలు ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయన్నారు. కట్టుకథలు, పిట్టకథలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ఓ ఛానల్ హైదరాబాద్ కూలిపోతుందని ప్రచారం చేస్తే, మరో ఛానల్ వరంగల్ నాశనమవుతుందని పోటాపోటీగా ప్రసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉండలనే చిత్థశుద్ధి ఉంటే ఆ ఛానళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల వరకు సీమాంధ్ర ఛానళ్లు ఇష్టమున్నట్టు ప్రసారం చేస్తాయని అయితే ఆ తర్వాత మన ఛానల్ ఆ ఛానళ్ల గుట్టు బయట పెడుతుందని అన్నారు. ఇప్పుడు ఛానళ్లు తెలంగాణపైన దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది 31 తర్వాత మరింత ఎక్కువ అవుతుందని ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X