గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల వేధింపులు తట్టుకోలేక మందు తాగి ఆత్మహత్యా యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి సంచలనం సృష్టించాడు. రామారావు అనే వ్యక్తి సోమవారం ఉదయం గుంటూరు జిల్లాలోని దాచేపల్లి పోలీసు స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి పోలీసు స్టేషన్ లోకి వెళ్లాడు. ఆయన దగ్గర పురుగుల మందు తాగిన వాసన గమనించిన పోలీసులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రామారావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

రామారావుది దాచేపల్లి మండలం నడికుడి గ్రామం. ఓ కేసు విషయంలో తనను పోలీసులు అస్తమానం మానసిక వేధనకు గురి చేస్తున్నారని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. సోమవారం కూడా కేసు విషయంలో భాగంగా రామారావు పోలీసు స్టేషన్ కి వచ్చాడు. కాగా కేసు విషయంలో మేము వేధించటం లేదని పోలీసులు అంటున్నారు. ఆయన భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X