వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఎదిగిన శక్తి: బరాక్ ఒబామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ హుసేన్ ఒబామాకు సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్ ఒబామాకు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, మరికొందరు కేంద్ర మంత్రులు ఉన్నారు.

అనంతరం ఒబామా ప్రసంగించారు. భారత్ తనకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిందని అన్నారు. భారత్ ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఎప్పుడో ప్రపంచ శక్తిగా ఎదిగిందని అన్నారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే తన పర్యటన ముఖ్యోద్ధేశ్యమని చెప్పారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఒబామా తనకు అత్యంత ఇష్టమైన, ఆదర్శనీయుడైన మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X