వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఎదిగిన శక్తి: బరాక్ ఒబామా
అనంతరం ఒబామా ప్రసంగించారు. భారత్ తనకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిందని అన్నారు. భారత్ ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఎప్పుడో ప్రపంచ శక్తిగా ఎదిగిందని అన్నారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే తన పర్యటన ముఖ్యోద్ధేశ్యమని చెప్పారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఒబామా తనకు అత్యంత ఇష్టమైన, ఆదర్శనీయుడైన మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
Comments
బరాక్ ఒబామా రాష్ట్రపతి భవన్ ప్రతిభా పాటిల్ మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ barack obama rashtrapati bhavan pratibha Patil manmohan singh new delhi
Story first published: Monday, November 8, 2010, 10:44 [IST]