హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో పట్టపగలే వెంటాడి వెటాడి రౌడీ షీట్ ను చంపారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో పట్టపగలో దారుణ హత్య జరిగింది. నాంపల్లిలోని కోర్టులో ఓ కేసు విషయమై సాక్ష్యం చెప్పడానికి వచ్చిన పంజాగుట్ట రౌడీ షీటర్ ఫజల్ ను కొందరు దుండగులు హత్య చేశారు. నాంపల్లి కోర్టులో ఫజల్ ఓ కేసు విషయం సాక్ష్యం చెప్పి తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో కొందరు హఠాత్తుగా వచ్చి ఆయనపై దాడి చేశారు. గమనించిన ఫజల్ అక్కడినుండి పరుగందుకున్నాడు. రెడ్ హిల్స్ లోని ఓ అపార్టుమెంటులో దూరాడు. అయితే ఆ దుండగులు అక్కడకు చేరుకొని ఫజల్ ను దారుణంగా పొడిచి చంపారు.

కాగా ఫజల్ హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పేరుమోసిన బడా రౌడీషీటర్ ఆయుబ్ ఖాన్ కు ఫజల్ తోడల్లుడు. వీరిద్దరు కలిసి హైదరాబాదులో లాండ్ సెటిల్మెంటులు చేసేవారు. కొన్నాళ్లు వారిద్దరు కలిసి సెటిల్మెంటులు చేశారు. కొద్దికాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ హత్యను ఆయుబ్ ఖానే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య లాండుసెటిల్మెంటు గొడవలు ఉండటంతో ఆర్థికలావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే మరో రౌడీషీటర్ ఖైజర్ కూడా ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X