వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాటర్ ట్యాంక్ పై కాంట్రాక్టు నర్సుల దీక్షలతో వరంగల్ లో ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: ఎంజిఎం కాంట్రాక్టు నర్సుల దీక్షలతో వరంగల్ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది నర్సులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ పైన నిరాహార దీక్షలు చేస్తున్నవారిలో నలుగురు ఆస్తమా రోగులు, ఇద్దరు గర్భిణీలు ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నర్సులు విమర్శిస్తున్నారు.

నర్సులతో జిల్లా కలెక్టర్, ఆస్పత్రి సూపరింటిండెంట్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నర్సుల ప్రతినిధులకు చర్చల కోసం హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. కోస్తాంధ్రలోని కాంట్రాక్టు నర్సుల ఉద్యోగాలను క్రమబద్దీకరించిన ప్రభుత్వం తెలంగాణలోని నర్సుల పట్ల వివక్ష ప్రదర్సిస్తోందని, తెలంగాణ నర్సుల ఉద్యోగాలను క్రమబద్దీకరించడం లేదని తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ వ్యాఖ్యానిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X