వైయస్ జగన్ ముందు వివియస్ లక్ష్మణ్ దిగదుడుపే
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి తొలిటెస్టు జరుగనున్న నేపథ్యంలో స్టేడియంలో ఒక స్టాండుకు లక్ష్మణ్ పేరుపెట్టాలని దాదాపుగా నిర్ణయించారు. స్టేడియం నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన శివలాల్ యాదవ్ సేవలకు గుర్తింపుగా పెవిలియన్ ఎండ్కు ఆయన పేరు పెట్టారు. రూ.4.5 కోట్లు ఇచ్చిన విశాఖ ఇండస్ట్రీస్ పేరు మరో ఎండ్కు పెట్టారు. గతంలో డబ్బుకు కొరత రావడంతో ఈస్టర్న్ స్టాండు హక్కుల్ని రూ.3.5 కోట్లకు జీఎంఆర్కు ఇచ్చారు. మిగిలింది వెస్టర్న్ స్టాండే. దానికి లక్ష్మణ్ పేరు పెట్టాలనుకున్నారు. ప్రకటనే తరువాయి అనుకున్న సమయంలో రంజీమ్యాచ్లో హైదరాబాద్ జట్టు 21 పరుగులకే ఆలౌటవడంతో 'లక్ష్మణ్ స్టాండు' ప్రకటన మూలన పడింది. కోచ్ల రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం అత్యవసరంగా హెచ్సీఏ కార్యనిర్వాహక కమిటీ భేటీ అయింది. కోచ్ల రాజీనామాలు ఆమోదించి, కొత్త శిక్షకులను నియమించాక సమావేశంలో వెస్ట్రన్ స్టాండ్ స్పాన్సర్షిప్ను భారతీకి కేటాయించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారతీ సిమెంట్స్ తెరపైకి రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.