మొద్దు శీను హత్య కేసులో ఓం ప్రకాశ్ కి జీవిత ఖైదు విధించిన కోర్టు
మొద్దుశీనును ఓం ప్రకాశ్ 2008 నవంబర్ 9వ తేదీన కారాగారంలోనే చంపాడు. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దుశీను తనను డిస్టర్బ్ చేశాడని దాంతో కోపమొచ్చి తాను అతన్ని డంబుల్ తీసుకొని చంపినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవిని మద్దెల చెర్వు సూరి కళ్లలో సంతోషాన్ని చూడడానికే తాను చంపానని మొద్దుశీను ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో కారాగార శిక్ష అనుభవస్తున్న మొద్దు శీనును ఓం ప్రకాశ్ రెండేళ్ల క్రితం చంపాడు.
Story first published: Wednesday, November 10, 2010, 12:15 [IST]