వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అనుకుంటే ఎలా, ఎవరికి దగ్గరుకుంటే వారికి ఇస్తామా : వికె దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ: కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన విందుకు తాను హాజరు కావడంపై తెలంగాణ నాయకులు చేస్తున్న విమర్శలకు శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ప్రతిస్పందించారు. ఎవరికి సన్నిహితంగా ఉంటే వారికి అనుకూలంగా నివేదిక ఇస్తామని అనుకుంటే సరికాదని ఆయన అన్నారు. తమ నివేదిక నిష్పాక్షికంగా ఉంటుందని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను విందుకు హాజరు కావడానికి ఏ విధమైన ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు. తాను అప్పారావుతో ఉంటేనో, తాను కామన్ వెల్త్ క్రీడలకు వెళ్తేనో, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుంటేనో వారికి అనుకూలంగా నివేదిక ఉంటుందని అనుమానిస్తే ఎలా అని ఆయన అన్నారు. తనపై వస్తున్న విమర్శలు తన ఆలోచనపై, తన పనిపై ఏ విధమైన ప్రభావం చూపబోవని ఆయన అన్నారు. తాను ఎవరిని కలిస్తే వారికి అనుకూలంగా నివేదిక ఇస్తానని అనడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులను తాను కలవడంలో తప్పు లేదని ఆయన అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత మరోసారి తాము హైదరాబాద్ వస్తామని ఆయన చెప్పారు. తాము నివేదిక తయారీలో చాలా బిజీగా ఉన్నామని ఆయన చెప్పారు. నాలుగు ప్రధానాంశాలపై తాము నిపుణలు కమిటీలు వేశామని ఆయన అన్నారు. హైదరాబాద్ తమ అధ్యయనంలో ప్రధానాంశమని, అది ప్రధానాంశమని కమిటీకి తెలుసునని, అందుకే హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనానికి ప్రతాప్ మను మెహతా నేతృత్వంలో ప్యానెల్ వేశామని ఆయన చెప్పారు. తాము నాలుగు ప్యానెళ్లు వేశామని చెప్పారు. నీటి పారుదుల, వ్యవసాయం, ఉద్యోగాలు, హైదరాబాద్ అభివృద్ధిపై ఆ ప్యానెళ్లు అధ్యయనం చేసి తమకు నివేదిస్తాయని ఆయన చెప్పారు. తాము డిసెంబర్ 31లోపల ఎట్టి పరిస్థితిలోనూ నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X