వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు కేశవ రావు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పోరాటానికి సమాయత్తమవుతుంటే అదే పార్టీకి చెందిన తెలంగాణ నాయకుడు కె. కేశవరావు వాదన మరో విధంగా ఉంది. సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల సమావేశం జరుగుతుండగానే కేశవరావు వారికి షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును కూలగొట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, తెలంగాణలోని గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, దాన్ని నివారించడానికి పోలవరం ప్రాజెక్టును ఆపేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పర్యావరణ అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ పనులను నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టుకు అనుమతి సాధించేందుకు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు సమాయత్తమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కేశవరావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X