హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ బాబుపై బాలయ్యకు కూడా చెప్పారు: లక్ష్మిపార్వతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబును ఎన్టీఆర్ దూరం పెడితే తాను బతిమిలాడానని ఆమె చెప్పారు. తాను చంద్రబాబును దూరం చేసుకోవద్దని చెప్తే నీకు తెలియదు, చంద్రబాబు ఎవరినైనా బలిపెడ్తారు, పాముకు పాలు పోసి పెంచినట్లేనని ఎన్టీఆర్ తనతో అన్నారని, ఇదే విషయం ఎన్టీఆర్ బాలయ్యతో కూడా అన్నారని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పార్టీలో రెండో స్థానానికి ఎదిగిన ప్రతి నాయకుడినీ చంద్రబాబు కుట్ర చేసి బయటకు పంపించేశారని, నల్లపు శ్రీనివాసులు రెడ్డి వంటివారిని పార్టీ నుంచి కుట్ర చేసి పంపించి వేసింది చంద్రబాబేనని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. తాను ఎన్టీఆర్ కుటుంబసభ్యులను దూరంగా చేసుకోవడానికి ప్రయత్నించలేదని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు అన్నం పెట్టలేదని తాను అనలేదని, అన్ని సమయాల్లో తాను తోడుగా ఉన్నానని మాత్రమే చెప్పానని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ మరణాంతరం తాను ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర కావడానికి ప్రయత్నించానని, వారిని తన కుటుంబ సభ్యులుగానే చూస్తూ వచ్చానని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తాను ఎప్పుడు కూడా విమర్శించలేదని ఆమె అన్నారు. చంద్రబాబును, దగ్గుబాటిని తాను పార్టీకి ఉపయోగపడతారని, వారిని దూరం చేసుకోకూడదని భావించానని ఆమె అన్నారు. అమాయకుడైన బాలయ్య చేత ఎన్టీఆర్ తో పెళ్లి కాలేదని అనిపించాడని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను దించేటప్పుడు చంద్రబాబు వెంట 30 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని, ఎన్నికలకు ముందు నుంచే ఎన్టీఆర్ పై చంద్రబాబు కుట్ర చేస్తూ వచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు తనను దుష్టశక్తిగా, సైతాన్ గా అభివర్ణించి క్షోభ పెట్టారని ఆమె అన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి పదివిపై కన్నేసిన మాట నిజం కాదా అని ఆమె అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X