అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొద్దు శీను హత్య కేసు దోషి ఓం ప్రకాష్ ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Moddu Seenu
కడప: పరిటాల రవి హత్య కేసు నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను హత్య కేసులో దోషి ఓంప్రకాష్ శుక్రవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిద్ర మాత్రలు మింగి అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మొద్దు శీను హత్య కేసులో ఓం ప్రకాష్ కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. అతన్ని గురువారం అనంతపురం జైలు నుంచి కడప జైలుకు తరలించారు. ఓం ప్రకాష్ తరలింపు విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచారు.

ఓం ప్రకాష్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వార్తలు రావడంతో ఆ విషయం బయటపడింది. కడప జైలులోకి నిద్ర మాత్రలు ఎలా వచ్చాయనేది అంతు పట్టకుండా ఉంది. అయితే, అనంతపురం జైలు నుంచి వచ్చినప్పుడు ఓం ప్రకాష్ జేబులో అవి ఉన్నట్లు అర్థమవుతోందని కడప జైలు అధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X