వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్ జిల్లాలో కుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపురం మండలం సర్వాయిపేట గ్రామంలో శనివారం పెను విషాదం చోటు చేసుకుంది. కుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మరణించారు. శనివారం ఉదయం ఆటకు వెళ్లిన ఆ ముగ్గురు కుంటలోకి దిగి జలసమాధి అయ్యారు. ఈ ముగ్గురికి కూడా ఈత రాదు. వారి వయస్సు 5 నుంచి ఆరేళ్ల మధ్య ఉంటుంది.

మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరో బాలుడు వారి స్నేహితుడు. దీంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. మరణించినవారిని గొడుగు రమేష్, గొడుకు సాయిలు, గోనెల వెంకటేష్ గా గుర్తించారు. ఆటకు వెళ్లిన తమ పిల్లలను వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు కుంటలో వారి శవాలు కనిపించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X