వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంగా జైపాల్ రెడ్డిని పంపిస్తారనే వార్తలను కొట్టిపారేస్తున్న ఎఐసిసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిని మారుస్తారని వస్తున్న వార్తలను ఎఐసిసి వర్గాలు ఖండిస్తున్నాయి. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పినట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను మార్చి పగ్గాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని రాష్ట్రానికి పంపిస్తున్నట్లు అధిష్టానం నుంచి ఆ మేరకు తమకైతే ఎలాంటి సమాచారమూ లేదన్నారు. అలాంటిదేమన్నా ఉంటే తమకు తప్పకుండా సమాచారమిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రులైనా కేంద్రమంత్రులైనా ఎవరు ఎక్కడుండాలనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానమని, అలా నిర్ణయించినపుడు దానికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X