హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ సినీ నిర్మాత డివిఎస్ రాజు కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

DVS Raju
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత డివిఎస్ రాజు కన్నుమూశారు. ఆయన శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశసంబంధమైన వ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. 1960 - 70 మధ్య ఆయన పలు హిట్ చిత్రాలు నిర్మించారు. గండికోట రహస్యం, పిడుగు రాముడు, ధనమా - దైవమా, జీవనజ్యోతి వంటి పలు సినిమాలను ఆయన తీశారు.

డివిఎస్ రాజు 1928 డిసెంబర్ 13వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. ఆయన జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారు. పలు చిత్రాల్లో ఆయన అతిథి పాత్రలు పోషించారు కూడా. జీవనజ్యోతి చిత్రానికి ఆయన స్వర్ణ నంది అవార్డును అందుకున్నారు. 2001లో ఆయన పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన మొత్తం 25 చిత్రాలు నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X