వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ తేల్చేది ఏమీ లేదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ తేల్చబోదని వార్తలు వస్తున్నాయి. తాము లాభనష్టాలపై మాత్రమే కేంద్రానికి నివేదిక ఇస్తామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి చెప్పారని సమాచారం. కెసిఆర్ తన ప్రతినిధి బృందంతో శుక్రవారం దుగ్గల్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ఇస్తే కలిగే లాభనష్టాలేమిటి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కొనసాగిస్తే కలిగే లాభనష్టాలేమిటి అనేది మాత్రమే తాము కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని దుగ్గల్ కెసిఆర్ తో చెప్పినట్లు సమాచారం.

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగానో, ప్రత్యేక రాష్ట్రంగానో చేయడానికి వీలు లేదని, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని కెసిఆర్ దుగ్గల్ కు మరోసారి చెప్పారు. 1956 అక్టోబర్ 31వ తేదీన ఏ ప్రాంతాలనైతే సీమాంధ్ర ప్రాంతాలతో కలిపారో, ఆ ప్రాంతాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఒక అంగుళం కూడా కదిలించడానికి వీలు లేదని కెసిఆర్ దుగ్దల్ తో చెప్పినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X