హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనాడు నాదెండ్ల భాస్కరరావు, ఈనాడు కెసిఆర్: ఎర్రంనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: తమ పార్టీని బలహీనపరచడానికి కాంగ్రెసు పార్టీ ఆనాడు నాదెండ్ల భాస్కరరావును ప్రయోగించారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ప్రయోగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు అన్నారు. ఇందిరా గాంధీ అనుసరించిన విధానాలనే ప్రస్తుతం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుసరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కాంగ్రెసు, కెసిఆర్ కలిసి తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆ ఆటలు సాగనివ్వమని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెసువారు, కెసిఆర్ తమ పార్టీని ఏం చేయలేరని ఆయన అన్నారు. కెసిఆర్ ఊసరవెల్లి అని, ఎప్పుడు ఏం మాట్లాడుతారో కెసిఆర్ కే తెలియదని ఆయన అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాంగ్రెసు, కెసిఆర్ కలిసి వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బలహీనపరచడానికి కెసిఆర్, కాంగ్రెసు కలిసి ఎత్తులు వేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X