హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పారామెడికల్ సిబ్బందితో మంత్రి దానం నాగేందర్ చర్చలు విఫలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: పారా మెడికల్ సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పారామెడికల్ సిబ్బంది మంగళవారంనుండి రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యాయి. గతకొద్ది రోజులుగా తమను క్రమబద్దీకరించాలని(రెగ్యులరైజ్) చేయాలని పారామెడికల్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని కోరింది.

అందుకోసం వారు ధర్నా చేపట్టారు. దీంతో మంత్రి దానం నాగేందర్ సోమవారం వారితో చర్చలకు ముందుకు వచ్చారు. అయితే పారా మెడికల్ సిబ్బందితో మంత్రి చర్చలు విఫలమయ్యాయి. వారిని క్రమబద్దీకరించేందుకు మంత్రి సుముఖంగా లేకపోవటంతో వారు తమ ఆందోళనను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X