వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యప్ప పాదాలు తాకిన కేసులో జయమాలకు హైకోర్టు బెయిలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayamala
బెంగుళూరు: శబరిమల కేసులో చిత్ర నటి జయమాలకు కర్ణాటక రాష్ట్రం హైకోర్టు సోమవారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది. మళ్లీ కోర్టు నుండి ఆదేశాలు వచ్చే వరకు జయమాలను అరెస్టు చేయవద్దని బెంగుళూరులోని హైకోర్టు ధర్మాసనం కర్ణాటక, కేరళ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జయమాల అరెస్టు చేద్దామనుకుంటున్న కర్ణాటక పోలీసులకు, కేరళ పోలీసులకు కోర్టు తీర్పు అడ్డుగా నిలిచింది.

చిత్ర నటి జయమాల 2006 జున్ లో శబరిమలలోని అయ్యప్ప స్వామి పాదాలను తాకారు. శబరిమలలోనికి మహిళల ప్రవేశం లేదు. వారు అయ్యప్పస్వామిని ముట్టుకోకూడదు. అలాంటిది జయమాల అయ్యప్ప పాదాలను ముట్టుకున్నారు. అప్పుడు ఆమెపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కోర్టులు పిల్ దాఖలు చేశారు. అయితే ముడు రోజుల క్రితం 12వ తారీఖున హైకోర్టు పోలీసులకు బెయిలు విషయమై నోటిసులు జారీ చేసింది. కాగా జయమాలిని కేసు విషయంలో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X