వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోత్కుపల్లి నర్సింహులు, సంకినేని వర్గాల మధ్య తన్నులాట
తెలుగుదేశం పార్టీ రెండు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. తమను శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పట్టించుకోవడం లేదని సంకినేని వర్గీయులు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. దీంతో సమావేశంలో శాసనసభ్యుడు మోత్కుపల్లిపై తీవ్ర ఘర్షణకు దిగారు. తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆలేరు నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మోత్కుపల్లి మారారు. ఈ సమావేశానికి తెలుగుదేశం శాసనసభ్యులు ఉమా మాధవరెడ్డి, చందర్ రావు కూడా హాజరయ్యారు.
Comments
తెలుగుదేశం నల్లగొండ మోత్కుపల్లి నర్సింహులు telugudesam Nalgonda mothkupally narasimhulu sankineni venkateswara rao
Story first published: Monday, November 15, 2010, 16:41 [IST]