వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానంపై ఒత్తిడికే పోలవరంపై చర్చల రాజకీయం: హర్షకుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానాన్ని అదుపులో ఉంచుకునేందుకే కొంత మంది నాయకులు పోలవరం ప్రాజెక్టుపై చర్చల రాజకీయం నడుపుతున్నారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత స్థితిలో నిర్మించకూడదని ఆయన వాదించారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిజైన్ మార్చకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.

కాంట్రాక్టర్ల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక ముందే కాలువలు తవ్వుతున్నారని ఆయన విమర్శించారు. డిజైన్ మారిస్తే ముంపు ప్రాంతాలు తగ్గుతాయని, దాని వల్ల గిరిజనులను ఎక్కువగా తొలగించకుండానే పని జరుగుతుందని ఆయన అన్నారు. డిజైన్ మార్చకపోతే నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X