రాజధానిలో మరో డ్రగ్స్ ముఠా: పట్టుబడ్డ ఇద్దరు నైజీరియన్లు
గత కొంతకాలంగా విదేశీ డ్రగ్సు మాఫియా మనపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీయులు డ్రగ్సు సరఫరా చేస్తున్నారు. గతంలో పలుమార్లు విదేశీయులు డ్రగ్సు అమ్ముతూ పట్టుబడ్డారు. ఇటీవల ప్రముఖ చిత్ర కథానాయకుడు రవితేజ సోదరులు ఉగండాకు చెందిన వ్యక్తుల దగ్గరనుండి డ్రగ్సు తీసుకుంటూ పట్టుబడ్డారు. డ్రగ్సు వ్యవహారంలో ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదు, బెంగుళూరులలో డ్రగ్సు మాఫియా ఉంది. ముంబయి మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో హైదరాబాదు పోలీసులు ముంబయి పోలీసులను అలర్ట్ చేశారు. ఇక్కడ కూడా డ్రగ్సు సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.
Comments
Story first published: Thursday, November 18, 2010, 17:18 [IST]