ఫ్రీజోన్ కు రోశయ్యతో కలిపి చంద్రబాబు కుట్ర: హరీష్ రావు
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయలేని హోంమంత్రి సబితారెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫ్రీజోన్, తెలంగాణ అంశాలపై కలిసి రావాలన్నారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అనుకుంటే ఆ పరీక్షలు ఎంత మాత్రం జరగనివ్వమన్నారు. విద్యార్థులు, తెలంగాణవాదులు అందరం కలిసి పరీక్షలను అడ్డుకుంటామన్నారు. మాకు తెలంగాణ ఎంత ముఖ్యమో హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు వెళితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.
Comments
Story first published: Thursday, November 18, 2010, 15:43 [IST]