హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేర్పాటువాదులు తెలంగాణకు కీడే చేస్తున్నారు: లగడపాటి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: ఎస్సై పోస్టుల నియామకం ప్రక్రియను ఆపాలని కోరడం ద్వారా వేర్పాటువాదులు తెలంగాణకు అన్యాయమే చేస్తున్నారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. సగానికిపైగా పోస్టులు వస్తున్నా తెలంగాణవాదులు రాద్ధాంతం చేయడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులో ఉద్యోగాలే లేవని, రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధన దీనికి వర్తించదని ఆయన అన్నారు. ఎస్సై నియామకాల వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైన అన్యాయం జరగదని ఆయన అన్నారు.

ఎస్సైల నియామకంలో తెలంగాణకు 643 పోస్టులు వస్తున్నాయని, జనాభా ప్రాతిపదికగా చూసినా ఈ నిష్పత్తి ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. నియామకంలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X