హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిగొచ్చిన సబితా ఇంద్రారెడ్డి: ఎస్సై పోస్టుల రాత పరీక్షలు వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. సోమవారం నుంచి తలపెట్టిన ఎస్సై రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యార్థుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, వారి మనోభావాలను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. హైదరాబాదు ఆరో జోన్ లో భాగమని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని, ఇందులో అనుమానాలు అవసరం లేదని ఆమె అన్నారు. ఎస్సై పోస్టుల నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైన అన్యాయం జరగదని తాము నమ్మించే ప్రయత్నం చేశామని, నిజానికి ఏ విధమైన అన్యాయం జరగదని ఆమె చెప్పారు. అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశామని ఆమె చెప్పారు.

రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ వెంటనే చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. రోశయ్య కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ రాశారని ఆమె చెప్పారు. రోశయ్య చిదంబరంతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వివాదాన్ని పరిష్కరించడానికి, కేంద్రం తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఓ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తోందని ఆమె చెప్పారు. రెండేళ్లుగా పరీక్షకు అభ్యర్థులు తయారవుతున్నారని, ఒక రాత పరీక్ష పూర్తి అయితే సరిపోతుందనే ఉద్దేశంతో రాతపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆమె వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల్లో ఉత్సాహం చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X