వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ముడి ఇనుము ఎగుమతిని నిషేధిస్తూ, ఎగుమతులకు ముడి ఇనుము రవాణా అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు శుక్రవారం బలపరిచింది. నిషేధాన్ని సవాల్ చేస్తూ 40 మైనింగ్ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను అరికట్టడానికి ఆరు నెలలలోగా నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు బి. శ్రీరాములు మైనింగ్ కంపెనీల కార్యకలాపాలపై ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ముడి ఇనుము రవాణాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X