హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20న బంద్ కు పిలుపునిచ్చిన కెసిఆర్: నేడు విద్యాసంస్థల బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా ఈనెల 20న తెలంగాణ బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు. జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రిదే బాధ్యతని ప్రకటించారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా దమనకాండను ప్రదర్శిస్తోందని అన్నారు. శనివారం నిర్వహించనున్న బంద్‌కు ఉద్యోగ, వ్యాపార, కార్మికవర్గాలు సహకరించాలని కెసిఆర్ కోరారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒయు జెఎసి శుక్రవారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. ఉస్మానియాలో ఆమరణ దీక్ష చేపట్టిన ఎస్సై అభ్యర్థులను గాంధీ ఆస్పత్రినుంచి డిశ్ఛార్జి చేశారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు వీరి దీక్షను భగ్నం చేసి గాంధీకి తరలించారు. వీరిలో వెంకటేష్‌, మురళీ, దయాకర్‌, లింగం, గోవింద్‌యాదవ్‌, సైదానాయక్‌లను గురువారం మధ్నాహ్నం డిశ్చార్జ్‌ చేసినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X