భగ్గుమన్న సీమాంధ్ర: రేపు బంద్ కు విద్యార్థుల జెఎసి పిలువు
అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కేయు) విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయు) విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. ఎస్సై పరీక్షల వాయిదాకు నిరసనగా సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్సై రాత పరీక్షల వాయిదాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. రోశయ్య పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర పరిరక్షణ సమితి రేపు శనివారం సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చింది.
Comments
Story first published: Friday, November 19, 2010, 15:21 [IST]