తెలంగాణ మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి: సీమాంద్ర విద్యార్థులు
ప్రభుత్వం రాత పరీక్షలను వాయిదా వేయడం దురదృష్టకరమని సీమాంధ్ జెఏసి నాయకుడు శ్యామ్యూల్ అన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. విద్యార్థుల వయసు ముగిసిపోతున్నందున ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే సీమాంధ్ర విద్యార్థుల తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్ఐ అభ్యర్థుల జీవితాలలో ప్రభుత్వం నిప్పులు పోస్తుందన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు తెలంగాణ వారు పూనుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం హింసను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు.
ఎస్ఐ పరీక్షల వాయిదా పట్ల సీమాంధ్ర యువత, విద్యార్థిలోకం అగ్గిమీద గుగ్గిలం అయింది. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వంనుండి ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్రిక్తంగా ఉన్నప్పుడు అక్కడ పరీక్షలు వాయిదా వేయండి. కాని సీమాంధ్రలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. డిసెంబర్ 18వ తారీఖుల ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు.