హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిఇడి అభ్యర్థుల ఆందోళన: భవనంపై నుంచి జారి పడి విద్యార్థికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ప్రభుత్వం వెంటనే బిఇడి-08లో అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం పైకి ఎక్కారు. పెట్రోలు బాటిళ్లు చేతిలో పట్టుకొని పోస్టింగ్ ఇస్తారా లేదా చావమంటారా అని ప్రశ్నించారు. మంత్రి మాణిక్యవరప్రసాద్ వెంటనే రావాలని వారు డిమాండ్ చేశారు. ఆయన వచ్చి తమకు హామీ ఇస్తే గాని కిందకు దిగేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

హామీ ఇవ్వకుంటే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు 70 : 30 ఆమోదయోగ్యం కాదన్నారు. 2008 నోటిఫికేషన్ ప్రకారమే మేం ఉద్యోగాలు భర్తీ చేయమని కోరుతున్నామన్నారు. కానీ మేం వేరే ఏదీ అడగటం లేదని వారు అంటున్నారు. కాగా భవనంపైకి ఎక్కిన ఒక మల్లారెడ్డి అనే అభ్యర్థి జారి కింద పడ్డాడు. అయితే ఆయనకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X