హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీతి లేని ఆంధ్రావాళ్లతో ఎలా కలిసి ఉంటాం?: కెసిఆర్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: నీతి లేని ఆంధ్రావాళ్లతో ఎలా కలిసి ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తుంటే సానుభూతి ప్రకటించకుండా వ్యతిరేకిస్తున్న ఆంధ్రావాళ్లతో ఎలా కలిసి పనిచేయగలుగుతామని ఆయన అడిగారు. ఫ్రీజోన్ పై శాసనసభలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని, దానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్నారని ఆయన శనివారం అన్నారు. ఇలా వుంటే తెలంగాణ, సీమాంధ్రల మధ్య కొట్లాటలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం బంగ్లాలు, వాటర్ ట్యాంకులు ఎక్కి దూకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర విద్యార్థుల ఆందోళన తెలంగాణవాదాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు. ధర్మంగా, నిజాయితీగా అడిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎస్సై రాత పరీక్షల కోసం ఓ 15 రోజులు ఆగితే సీమాంధ్ర విద్యార్థుల కొంపలు మునుగుతాయా అని ఆయన అడిగారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్యనే నాన్చారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర రాజకీయ జెఎసి కన్వీనర్ శామ్యూల్, ఇతర సీమాంధ్ర నాయకులు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగుల క్వార్టర్ల కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X