హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో ఎస్సీ పరీక్షలు పెడ్తాం, ఆందోళన విరమించండి: సబితా ఇంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: ఎస్సై పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆందోళనలు విరమించుకోవాలని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో, అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన తర్వాత ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణం ఉంటే తప్ప పరీక్షలు నిర్వహించాడనికి వీలు కాదని, దాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆమె అన్నారు.

హైదరాబాద్ ను ఆరో జోన్ లోకి తెస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎస్సై పరీక్షల నిర్వహణ వల్ల ఆరో జోన్ లోని అభ్యర్థులకు ఏ విధమైన అన్యాయం జరగదని నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా తెలంగాణ విద్యార్థులు ఆందోళన విరమించుకోలేదని ఆమె చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X