హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు చెప్పి చేస్తే బాగుండేది: సబితా ఇంద్రారెడ్డితో సీమాంధ్ర మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: ఎస్సై రాత పరీక్షలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై సీమాంధ్ర మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సై రాత పరీక్షలను వాయిదా వేయడంతో తమ ప్రాంతంలో ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు శనివారం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. వాయిదా వేసే ముందు తమకు చెప్పి ఉంటే బాగుండేదని సీమాంధ్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డితో అన్నారు. సీమాంధ్ర విద్యార్థులు పరీక్ష నిర్వహించాలని అడుతున్నారు కదా ఇప్పుడేం చేస్తారని వారు అడిగారు.

ఎస్సై పరీక్షలను వాయిదా వేయడానికి తలెత్తిన పరిణామాలను సబితా ఇంద్రారెడ్డి సమావేశంలో వివరించారు. సీమాంధ్రలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని, సాధ్యమైనంత త్వరలో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆమె చెప్పారు. ఎస్సై పరీక్షలను వాయిదా వేయడం వల్ల సీమాంధ్రలో ప్రభుత్వం చులకనైందని సీమాంధ్ర మంత్రులు అన్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X