హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఎంపీ అనే విషయమే మరిచిపోయారు: బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కన్నీళ్లు పెట్టుకునే వారు అనటం వెక్కిరింపుగా అంటున్నారా అని కాంగ్రెసు నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని మంత్రులను, శాసనసభ్యులను కట్టడి చేశాడని, ఆలా చేశాడంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనే ఉద్దేశ్యమే కదా అని ఆయన అన్నారు. పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని నిర్ణయించుకున్నప్పుడు ఆయన సాక్షి కథనాలపై, ప్రసారాలపై కాంగ్రెసు వారు ఆగ్రహం వ్యక్తం చేయటం అభ్యంతరకరమన్నారు. జగన్ పార్టీ పార్లమెంటు సభ్యుడన్న విషయమే మరిచిపోయిందన్నాడు.

కాంగ్రెసు కు వ్యతిరేకంగా మిగిలిన వేరే పత్రికలు, టీవీలు ఇంతకంటే ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయని అక్కడ ధర్నా చేసి అడ్డుకోని వీరు సాక్షిని ఒక్కదానిని అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. మీడియాపై దాడులు భావ్యం కాదన్నారు. కాంగ్రెసు 125వ ఆవిర్భావ సంబరాల సందర్భంగా ఓ కథనాన్ని ప్రసారం చేస్తే అందులో ఎంత వరకు నిజం ఉందో ఆలోచించాలన్నారు. ఒకవేళ ప్రసారమైన దానిలో తప్పు ఉంటే ఖండించాలి. కాని ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు. ఆ కథనంలో నిజం ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలన్నారు. సాక్షి కథనానికి అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X