ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి కార్యాలయంపై యూత్ కాంగ్రెసు దాడి: 7గురి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
ఒంగోలు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియాలో ఏఐసిసికి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా రావటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల వైయస్ జగన్ కు, సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.ప్రకాశం జిల్లాలోని చీరాలలో సాక్షి కార్యాలయంపై యూత్ కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేశారు. సోనియాకు అనుకూలంగా, సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

ఆందోళనకారులు కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనలో ఓ విలేకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఏడుగురు ఆందోళనకారులను అరెస్టు చేశారు. కాగా సాక్షి కథనాన్ని ఖండిస్తూ దానం, కోమటిరెడ్డి వంటి మంత్రులు సైతం ధర్నాలలో పాల్గొన్నారు. కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు అనుచరులు కొందరు సాక్షి ప్రతులను హైదరాబాదులో దగ్ధంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X