సాక్షి కార్యాలయంపై యూత్ కాంగ్రెసు దాడి: 7గురి అరెస్టు
ఆందోళనకారులు కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనలో ఓ విలేకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఏడుగురు ఆందోళనకారులను అరెస్టు చేశారు. కాగా సాక్షి కథనాన్ని ఖండిస్తూ దానం, కోమటిరెడ్డి వంటి మంత్రులు సైతం ధర్నాలలో పాల్గొన్నారు. కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు అనుచరులు కొందరు సాక్షి ప్రతులను హైదరాబాదులో దగ్ధంచేశారు.
Comments
Story first published: Sunday, November 21, 2010, 12:14 [IST]