కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్ ఫైర్ తో కడపలో ఆర్ఎస్ఐ మునుస్వామి మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప‌: గన్ మిస్ ఫైర్ కావడంతో కడపలోని ఎపిఎస్పీ 11వ బెటాలియన్ ఆర్ఎస్ఐ మునుస్వామి మరణించాడు. బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లి అతను మృతి చెందాడు. గన్ ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మునుస్వామి చిత్తూరు జిల్లాకు చెందినవాడు. అతనికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతను పదవీ విరమణ చేయాల్సి ఉంది.

మునుస్వామి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యల వల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధులు నిర్వహిస్తుండగా మునుస్వామి మరణించినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X