వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంటోనీతో భేటీ: వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి రోశయ్య?

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Antony
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఫిర్యాదు చేయడానికి రాలేదని చెప్పిన ముఖ్యమంత్రి కె. రోశయ్య అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ వచ్చిన వెంటనే ఆయన కేంద్ర మంత్రి, ఎఐసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తానని రోశయ్య చెప్పారు. అయితే, ఆంటోనీ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కావడం వల్ల వైయస్ జగన్ పై ఫిర్యాదు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు.

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంపై రోశయ్య ఆంటోనీకి వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో వైయస్ జగన్ మాట్లాడిన విషయాలను, వైయస్ జగన్ అనుచర గణం చేసిన వ్యాఖ్యలను ఆయన ఆంటోనీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వైయస్ జగన్ వ్యవహారశైలిపై కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరే గళం విప్పుతున్నందు వల్ల రోశయ్య ఢిల్లీ యాత్ర ముఖ్యంగా జగన్ పై గురి పెట్టిందేనని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X