హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు ఢిల్లీకి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గం ఏర్పాటు ఎల్లుండి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kirankumar reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ భవన్లో గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా నిమ్స్ కు వెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యశ్రీ వార్డును సందర్శించారు. పలువురు రోగులను పరామర్శించారు. నిమ్స్ ను ఆయన సందర్శించినప్పుడు ఆయన వెంట మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పితాని సత్యానారాయణ ఉన్నారు. అనంతరం అయన లేక్ వ్యూ గెస్టు హవుస్ కి చేరుకున్నారు.

అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతారు. ఆసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సాయంత్రం 6 గంటలకు కలుస్తారు. ముఖ్యమంత్రి శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అవుతారు. కేబినెట్ విషయమై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆయన హైదరాబాదుకు రేపే తిరిగి వస్తారు. కాగా ఎల్లుండి మంత్రివర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X