హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడు: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియామకం కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన వర్గానికి చెక్ అవుతుందో లేదో కారణమే నిర్ణయిస్తుందని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు అన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందని ఆయన అన్నారు. జగన్ తన ఓదార్పు యాత్రను వ్యక్తిగత యాత్ర అంటున్నారని, అలాంటప్పుడు ఆ యాత్రలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కులాల కోణంలో చూడవద్దని ఆయన కోరారు. ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వాడన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాలని భావించటం లేదని, ఆయనకు అసలు పార్టీని వీడే ఉద్దేశ్యమే లేదన్నారు. 1989-94 మధ్య సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వైఎస్ అన్ని కోరికలు తీరిన తర్వాతనే ఆయన చివరి కోరిక తీరుతుందని కిరణ్ కుమార్ రెడ్డి (41 ఎంపీల సీట్లు, రాహుల్ ప్రధాని) వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అంబటి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X