వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు షోకాజ్, వివరణ తర్వాత చర్యలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఎఐసిసి క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలోని ఎఐసిసి క్రమశిక్షణా సంఘం శనివారం సమావేశమై వైయస్ జగన్ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. జగన్ కు తొలుత షోకాజ్ నోటీసు జారీ చేయాలని, ఆ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన తర్వాత జగన్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) అభిమతంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా క్రమశిక్షణా సంఘం వైయస్ జగన్ వ్యవహారంపై చర్చ జరిపినట్లు సమాచారం.

కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జైపాల్ రెడ్డితో పార్టీ అధిష్టానమే మాట్లాడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ జైపాల్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవడానికే ఆయన వచ్చినట్లు చెబుతున్నప్పటికీ వైయస్ జగన్ వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X