హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటుతో తేలిపోతుంది: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వైయస్ జగన్ కూ పార్టీకీ మధ్య ఆగాధం తోలగించడానికా, విషవలయంలో చిక్కుకున్నారా అనే ధర్మసందేహం ఉందని, అన్నీ ముఖ్యమంత్రి కె. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి ఏర్పాటుతో తేలిపోతుందని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ తో బేటీ అనంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ వివేకానంద రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరుతున్న విషయంపై తాను జగన్ తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. వైయస్సార్ కుటుంబంలోని తాజా పరిణామాలపై తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. వైయస్సార్ కుటుంబంలో ఏ విధమైన కలహాలూ లేవని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ జగన్ శిబిరం నడపడం లేదని, కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఇంటి వద్ద సందడి తగ్గిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వైయస్ జగన్ ను సందర్శించడానికి అభిమానులు వస్తూనే ఉంటారని ఆయన అన్నారు. సాక్షి వార్తాకథనాలకు వైయస్ జగన్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోనియాకు వ్యతిరేకంగా వైయస్ జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ పై పార్టీ అధిష్టానం చర్య తీసుకుంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X