వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై అధిష్టానం సీరియస్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: వివాదాలకు దూరంగా ఉండే కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తొలిసారి కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. వైయస్ జగన్ వల్ల రాష్ట్ర కాంగ్రెసులో సమస్యలున్నాయని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు. సాక్షి టీవీ చానెల్ లో వచ్చిన వార్తకథనాలు గురించి అందరికీ తెలుసునని, సాక్షి వైయస్ జగన్ సొంతమేనని కూడా తెలుసునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ జగన్ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణను వైయస్ జగన్ ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ లను కూడా సాక్షి టార్గెట్ చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడని, వైయస్ జగన్ కు చెందిన సాక్షిలో రాహుల్, సోనియాలను టార్గెట్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైయస్ జగన్ రాజకీయాల కోసం నడుస్తోందని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X