వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిపించని వీరప్ప మొయిలీ: వైయస్ జగన్ క్యాంప్ నో చాన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల నుంచి అనూహ్యంగా కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని తప్పించినట్లు కనిపిస్తోంది. అధికారికమైన ప్రకటన చేయకుండా మొయిలీని పక్కన పెట్టి గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందుకు తెచ్చారు. మొయిలీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. సిఎల్పీ కొత్త నేత ఎంపిక సమయంలో ఆజాద్ ను పిలిపించి హైదరాబాదుకు పంపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ కూర్పు, వైయస్ జగన్ పై చర్యల వ్యవహారం వంటి అత్యంత కీలక విషయాలు చోటు చేసుకున్న సందర్భంలో మొయిలీ కనిపించడం లేదు. ఢిల్లీలో ఆయన కనిపించడం లేదు. అంతా గులాం నబీ ఆజాదే చూస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలందరినీ కలుస్తున్నారు. కానీ మొయిలీ ఊసు మాత్రం రావడం లేదు. వ్యవహారాలన్ని ఆజాద్ చేతిలో వెళ్లాయని గుర్తించిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ వీరాభిమానులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అనవసరమైన గందరగోళం సృష్టిస్తారనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అధిష్టానం ఇష్టంగా లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X