హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజారాజ్యం మంత్రివర్గంలో చేరడం మీడియా అజెండాయే: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మంత్రివర్గంలో చేరడం మా అజెండా కాదని అది కేవలం మీడియా అజెండాయేనని ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం విలేకరులతో అన్నారు. ఆదివారం పూలేకు చిరంజీవి, అల్లు అరవింద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. మాది మంత్రివర్గంలో చేరే అజెండా కాదని ప్రజలే మా ఎజెండా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజారాజ్యం మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

ప్రజారాజ్యం మంత్రివర్గంలో చేరుతుందని ఓసారి, చేరదని మరోసారి మీడియానే ప్రచారం చేస్తుందన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై తాను మీడియాలో చూసే తెలుసుకుంటున్నానని అన్నారు. పూలే ఆశయాలను ప్రజలలోకి తీసుకు వెళతామన్నారు. ఆయన బాటలో ప్రజారాజ్యం పార్టీ నడుస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X