హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాదిగలకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలో మాదిగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాడ సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగలనే ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. డిసెంబర్ 4న మాదిగల యుద్ధభేరీ ఉంటుందన్నారు. తన మంత్రివర్గంలో మాదిగలకు సముచిత స్థానం కిరణ్ కుమార్ ఇవ్వకుంటే యుద్ధభేరీలో రాజకీయ ఎజెండా ప్రకటిస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ మొదటి నుండి మాదిగలకు మోసం చేసిందని ఆయన అన్నారు. మాలలకే ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. మాలలకు అనేక పదవులు ఇచ్చిందన్నారు. మాలలనుండే కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. మాదిగలను నిర్లక్ష్యం చేస్తే మాదిగల సత్తా చూపిస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X